Tuesday, September 17, 2024

Flood Relief Fund – వ‌ర‌ద బాధితుల‌కు ప్రభుత్వ ఉద్యోగుల భారీ సాయం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్: భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం రూ.130 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఈరోజు మహబూబాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు సతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ద్యో గులందరినీ అభినందించారు. “వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు మూలవేతనాన్ని అందించడం వారి మానవత్వానికి ఒక ప్రతీక. మనస్పూర్తిగా వారిని అభినందిస్తున్నాను. త్వరలోనే మీ ఉద్యోగ జేఏసీలతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమవుతాను” అని తెలిపారు.

తెలంగాణ ప్రజలు విపత్తులో ఉన్న సమయంలో ఉద్యోగులంతా కలిసి సీఎం సహాయ నిధికి రూ.130 కోట్లు విరాళం ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి న్నారు. ఉద్యోగులు అందరికీ మంత్రి గారు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

ఈ చిన్నారిది పెద్ద మ‌న‌సు….

కాగా, వరద సహాయక కార్యక్రమాలకు తన కిట్టీ బ్యాంకు నుంచి రూ.3 వేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు అంద‌జేసింది. ఈ సంద‌ర్భంగా రేవంత్ విద్యార్ధిని ఆశీర్వ‌దించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement