Friday, September 6, 2024

Flood – భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి

భద్రాచలం జూలై 27 (ప్రభ న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరిగింది. శనివారం ఉదయం 8 గంటలకు నీటి మట్టం 51.1 అడుగులుగా నమోదయింది. ఎగువ నుంచి వెల్లువెత్తుతున్న వరద ఉధృతితో భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరిగే అవకాశం ఉంది.

కాలేశ్వరంలో పూర్తిస్థాయిలో నీటిమట్టం చేరుకోవటం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం నుంచి గోదావరి పెరుగుతూ వస్తుంది. ఇలా ఉండగా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ అన్ని మండలాల అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement