Tuesday, October 22, 2024

Flash News – పవన్ కల్యాణ్‌కు సిటీ కోర్టు సమన్లు

హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరిలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ గ‌తంలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందువుల మనోభావాలు ఈ వ్యాఖ్య‌లు దెబ్బతీశాయని భావిస్తూ, న్యాయవాది ఇమ్మనేని రామారావు సిటీ కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు.

దీనిపై నేడు విచారణ జ‌రిపిన సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై రేణుక నవంబర్ 22వ తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కోర్టు సమన్లు జారీ చేశారు. అలాగే తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, వెబ్‍సైట్లు, యూట్యూబ్ చానెళ్ల నుంచి తొలగించేలా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోర్టును పిటిషనర్ కోరారు. దీనిపై నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement