Friday, September 6, 2024

Secunderabad : రైల్లో మంటలు.. భారీగా ఎగిసిపడుతున్న పొగలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. అలుగడ్డ బావి వద్ద ఉన్న స్పేర్ కోచ్‌ల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఫైర్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

కాగా ప్రమాద సమయంలో రైల్ కోచ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జీఎం ఆరా తీస్తున్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement