Saturday, September 7, 2024

Fire Accident – జియాగూడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం – తండ్రి, కుమార్తె మృతి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : పాతబస్తీ జియాగూడ ప‌రిధి వెంక‌టేశ్వ‌ర న‌గ‌ర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ లో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో తండ్రి, పదేళ్ల కుమార్తె చెంద‌గా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. మొద‌ట అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ తయారీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఆ బిల్డింగ్‌ మొత్తానికి వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు.

ప‌ది ఫైర్ ఇంజిన్ల‌తో మంట‌లు అదుపు
ప్ర‌మాద‌ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపార్టుమెంటు మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న 20 మందిని రక్షించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక శివప్రియ (10) మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు అక్క‌డ చికిత్స పొందుతూ శివ‌ప్రియ తండ్రి శ్రీనివాస్ క‌న్నుమూశారు దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement