Sunday, October 6, 2024

TG: యాదాద్రి ఆలయంలో సినీనటి మంచులక్ష్మీ పూజలు..

సంస్కృత పాఠశాల భవన నిర్మాణం చేస్తా
భగాయత్ పాఠశాలలో విద్యార్థులతో సినీనటి మంచు లక్ష్మి సమావేశం..

ప్రభన్యూస్ / యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని సినీనటి మంచు లక్ష్మీ దర్శించుకుని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూర్తుల దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో భాస్కర్ రావు స్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు. దర్శనం తదుపరి కొండ కింద ఆలయ సంస్కృత పాఠశాలను ఆలయ ఈవో భాస్కర్ రావుతో కలసి సందర్శించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

సంస్కృత పాఠశాల విద్యార్థుల కోరిక మేరకు నూతన హాస్టల్ భవనం నిర్మిస్తామని సినీనటీ మంచు లక్ష్మీ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతు కె జెండగే తో సమావేశమై భువనగిరి పట్టణ కేంద్రంలోని భగాయత్ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట అదనపు కలెక్టర్ గంగాధర్, డీఈవో నారాయణ రెడ్డి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement