Saturday, October 19, 2024

MDK | విద్యుత్ షాక్ తో రైతు మృతి..

వెల్దుర్తి, అక్టోబర్ 19, (ఆంధ్రప్రభ) : విద్యుత్ షాక్ తగిలి తన పంట పొలంలో రైతు మృతిచెందిన సంఘటన వెల్దుర్తి మండల పరిధిలోని యశ్వంతరావు పేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలాలిలా ఉన్నాయి.

యశ్వంతరావు పేట గ్రామానికి చెందిన గుండెని యాదయ్య (45) శుక్రవారం రాత్రి 10 గంటలకు తన ఇంటి నుండి బయలుదేరి తన పంట పొలం వద్దకు వెళ్లాడు. పంట పొలంలో వేసిన పంటకు అడవి పందుల బెడద ఎక్కువ కావడంతో పంట రక్షణ కోసం పొలం చుట్టూ ఇనుప వైర్లు పెట్టి కరెంటును అమర్చాడు. తను పెట్టిన వైర్లను తానే మరిచిపోయి కరెంటు అమర్చిన వైర్లకు తగలడంతో రైతు యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ఉదయాన్నే పక్క పొలం రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా యాదయ్య మృతిచెందినట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. భార్య ఇంద్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.

- Advertisement -

పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాదయ్య మృతిచెందడంతో మృతదేహం వద్ద భార్య, పిల్లలు బోరున‌ విలపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటనతో యశ్వంతరావు పేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య ఇంద్రమ్మ, కుమారులు ప్రవీణ్, లింగం ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement