Sunday, June 30, 2024

Extended – అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల బస్‌ పాస్‌ గడువు పొడిగింపు .. ఇలా అప్లై చేసుకోండి..

హైద‌రాబాద్ – రాష్ట్రంలోని అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల రాయితీ బస్‌ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పొడిగించింది. ప్రస్తుత బస్‌ పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్‌ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్‌ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బస్‌ పాస్‌ల గడువును మూడు నెలల పాటు టీజీఎస్‌ఆర్టీసీ పొడిగించింది.

అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల రాయితీ బస్‌ పాసుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. కాలపరిమితి పొడిగించిన ఈ బస్‌ పాస్‌లను గతంలో మాదిరిగానే https://tgsrtcpass.com/journalist.do?category=Fresh లింక్‌ పై క్లిక్‌ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

దరఖాస్తుల్లో జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో, అక్రిడిటేషన్‌ కార్డులను విధిగా అప్‌లోడ్‌ చేయాలి. బస్‌ పాస్‌ కలెక్షన్‌ సెంటర్‌నూ ఎంపికచేసుకోవాలి. ఈ దరఖాస్తులను సమాచార, పౌరసంబంధాల శాఖ ఆన్‌ లైన్‌ లో ధృవీకరించిన తర్వాత జర్నలిస్టులకు బస్‌ పాస్‌లను టీజీఎస్‌ఆర్టీసీ జారీ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement