Tuesday, September 17, 2024

Erravalli – నేడు తండ్రి ఇంటికి వెళ్లనున్న తనయ

హైదరాబాద్ – బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు.

బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలవబోతున్నారు. సుమారు ఐదున్నర నెలల తరువాత కేసీఆర్ ను ఆమె కలవనున్నారు. నిన్న హైదరాబాద్ చేరుకున్న కవిత కుమార్తెతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఈరోజు రమ్మని కవితను ఆహ్వానించారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌లో అరెస్టయి ఐదున్నర నెలల పాటు తిహాద్ జైలులో ఉన్న కవితకు ఈ నెల 27న బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement