Saturday, July 6, 2024

TG: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. మంత్రి శ్రీధర్ బాబు

.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఊరూరా ఉద్యమంలా మొక్కలు నాటి పచ్చదనాన్ని పాంపొందించాలని పిలుపునిచ్చారు.

రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుందని, మొక్కల పెంపకంతో కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement