Monday, July 1, 2024

HYD: నార్సింగిలో ఇంజినీర్ హత్య..

మణికొండ, జూన్ 29 (ప్రభ న్యూస్): నార్సింగిలో పట్టపగలే దారుణహత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12-12.30 సమయంలో సయ్యద్ ఇదాయత్ అలీ (31) అనే యువకుడు మరికొందరితో కలిసి క్వాలిస్ వాహనంలో మంచిరేవులలోని గ్రీన్ ల్యాండ్స్ వెంచర్ వద్దకు వచ్చాడు.

అక్కడ ఏం జరిగిందో కానీ.. గుర్తుతెలియని వ్యక్తులు అలీని కత్తితో పొడిచి హ‌త‌మార్చారు. అలీ.. గోల్కొండలోని చోటా బజార్ ఏరియాకు చెందిన వ్య‌క్తి. సౌదీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. నార్సింగి పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement