Friday, September 20, 2024

KHM: దంపతులకు విద్యుత్ షాక్… భార్య మృతి…

పినపాక, ఆగస్టు 26 (ప్రభ న్యూస్) : కిరాణ సామానులు సదురుతుండగా భర్తకు విద్యుత్ షాక్ కొట్టడంతో భర్తను కాపాడే తరుణంలో భార్యకు కరెంటు షాక్ తగిలి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పినపాక మండలంలోని పాండురంగాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మండలంలోని పాండురంగాపురం గ్రామానికి చెందిన కోమరం సర్వేష్, సమ్మక్క (26) భార్యభర్తలు కిరాణ షాపును నడుపుకుంటూ జీవినం సాగిస్తున్నారు. సోమవారం షాప్ లో సామానులు సర్దుతుండగా, సర్వేష్ కు కరెంట్ షాక్ తగిలింది. ఈ క్రమంలో భర్త అరవడంతో భార్య సమ్మక్క, భర్తను కాపాడే క్రమంలో మృతురాలికి కూడా కరెంట్ షాక్ కు గురైంది.

స్థానికులు గమనించి వైద్యం కోసం మణుగూరు ప్రభుత్వ ఏరియా అసుపత్రికి తరలించారు. అప్పటికే సమ్మక్క చనిపోయిందని వైద్యులు తెలిపారు. సర్వేష్ కు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement