Monday, July 1, 2024

TS: నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక

నల్లగొండ, జూలై 1, ఆంధ్ర‌ ప్రభ ప్రతినిధి : నల్లగొండ డీసీసీబీ నూతన చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంభం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై మూడు రోజుల క్రితం డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం చేయడంతో నూతన చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది..

దీంతో సోమవారం నూతన చైర్మన్ ఎన్నికకు నిర్వహించిన ఓటింగ్ లో 19 మంది డైరెక్టర్లకు గాను 15 మంది కుంభం శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా ఓటువేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితో పాటు నలుగురు డైరెక్టర్లు ఓటింగ్ కు హాజరు కాలేదు. 15మంది డైరెక్టర్లు కుంభం శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయడంతో శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డీసీఓ కిరణ్ కుమార్ ప్రకటించారు. నూతన చైర్మన్ గా ఎన్నికైన అనంతరం శ్రీనివాస్ రెడ్డి వెంటనే బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement