Sunday, July 7, 2024

TG: ఈడీ స్పీడ‌ప్… ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి లాక‌ర్ నుంచి 1.2 కేజీల గోల్డ్ స్వాధీనం

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనీలాండరింగ్ కేసులో దర్యాప్తును మరింత స్పీడప్ చేసింది ఈడీ. కేసులో ఎమ్మెల్యే కు సంబంధించి 1.2 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్ లో నమోదైన మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తులో భాగంగా లోకల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కు తీసుకెళ్లింది ఈడీ.

అక్కడ ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో కోటి విలువైన బంగారం దొరికింది. అదే సమయంలో, ఎమ్మెల్యే సోదరుడు జి మధుసూధన్ రెడ్డి, ఇతరులకు సంబంధించిన మైనింగ్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేస్తోంది. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్ లకు రసీదులు కానీ, ఎలాంటి డాక్యుమెంటేషన్ లు లేవని స‌మాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement