Sunday, September 8, 2024

ED – డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నవదీప్ ..

హైదరాబాద్‌: మాదకద్రవ్యాల వ్యవహారంలో సినీనటుడు నవదీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఎదుట విచారణకు నేడు హాజరయ్యారు. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతన్ను ప్రశ్నిస్తున్నది. డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్‌ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై లోతుగా ఈడీ విచారించనుంది.

కాగా, గుడిమల్కాపూర్‌ ఠాణా పరిధిలో ఇటీవల నమోదైన మాదకద్రవ్యాల కేసులో బహిర్గతమైన అంశాల ఆధారంగా ఈనెల 10న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కిన నైజీరియన్‌ డ్రగ్‌పెడ్లర్‌తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్‌ పేరు బయటికివచ్చింది. ఈ క్రమంలోనే నవదీప్‌ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్‌ పోలీసులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. తాజాగా ఈడీ దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement