Monday, September 16, 2024

TG: హైదరాబాద్​లో మత్తు కలకలం!

₹8.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
కారు, మూడు సెల్‌ఫోన్లు సీజ్‌
ముగ్గురు నిందితుల‌ అరెస్టు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : హైదరాబాద్ న‌గ‌రం​ బోయిన్​పల్లి పరిధిలో భారీగా డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకున్నారు. ప‌క్కా స‌మాచారంతో హైద‌రాబాద్ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆప‌రేష‌న్ చేశారు. రూ.8.5 కోట్ల విలువైన 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఒక కారు, మూడు సెల్​ఫోన్లు సీజ్ చేశారు. అరెస్ట‌యిన వారిలో పెడ్ల‌ర్ నాగ‌రాజు, వినోద్ కుమార్‌, శ్రీ‌శైలం ఉన్నారు.

డ్ర‌గ్స్ అమ్ముతున్న నైజీరియా మ‌హిళ‌…
డ్ర‌గ్స్ అమ్ముతున్న నైజీరియాకు చెందిన ఓ మ‌హిళ‌ను రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఉన్న న‌లుగురు ప‌రార‌య్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితురాలి నుంచి 50గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్​లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement