Wednesday, September 18, 2024

Disqualification Case – వాద‌న‌లు పూర్తి… తీర్పు రిజ‌ర్వ్ …

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు
తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
కోర్టును ఆశ్రయించిన బీఆర్​ఎస్​

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు పూర్తి కాగా తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఫిర్యాదును స్పీకర్‌ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద్ కోర్టు తలుపు తట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడునెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ నిర్ణయం తీసుకునేలా కోర్టులు ఆదేశించే అధికారం లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement