Sunday, September 29, 2024

వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు యువ‌కులు మృతి

వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రంగార‌రెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్‌గూడ చిన్న‌మ్మ‌ హోటల్ వ‌ద్ద వేగంగా వ‌చ్చిన కారు అదుపుత‌ప్పి బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఊట్‌ప‌ల్లికి చెందిన విశ్వ‌జిత్‌గా పోలీసులు గుర్తించారు.

వికారాబాద్ జిల్లా తాండూర్ రాజీవ్ గృహ క‌ల్ప వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో బైక్‌ను కారు ఢీకొట్ట‌డంతో ఓ యువ‌కుడు మృతి చెందాడు. ఈ ప్ర‌మాదంలో మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement