Tuesday, October 22, 2024

WGL | పనిభారం తగ్గించాలంటూ పోలీసు కుటుంబాల ధర్నా

వరంగల్, అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ) : వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు ఆవేదన వ్య‌క్తం చేశాయి. కానిస్టేబుళ్లను వెట్టిసాకిరి చేపిస్తూ.. కనీసం సెలవులు ఇవ్వకుండా.. కుటుంబానికి దూరం చేస్తున్నారని కుటుంబ స‌భ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కానిస్టేబుళ్ల‌ భార్యలు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

నిరసనను ఆపేందుకు ఆర్ టీ ఓ ఆఫీస్ నుండి మామునూరు బెటాలియన్ వరకు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. రిజర్వ్డ్ పోలీసుల బాధలను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.. కొత్త డీజీ రావడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement