Friday, October 25, 2024

Devotional – భ‌ద్రాద్రి రామ‌య్య సేవ‌లో గ‌వ‌ర్న‌ర్ ….

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నేడు దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. గవర్నర్‌కు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఆలయ ఈవో రమాదేవి అందజేశారు.

అంతకుముందు గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఐటీడీఏ పీవో రాహుల్‌ స్వాగతం పలికారు. గవర్నర్‌తో పాటు మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు లు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement