Thursday, September 12, 2024

Devarakonda – ఎలుకలు కరిచిన గురుకుల విద్యార్థులకు బీఆర్ఎస్ నేతల పరామర్శ

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండభీమనపల్లి బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థినిలను ఎలుకలు కరిచాయి. దీంతో పలువురు విద్యార్థినిలు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.

తాజాగా వారిని బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గాదరి కిశోర్ కుమార్ పరామర్శించారు.

బాధిత విద్యార్థినులను అడిగి వివరాలు సేకరించారు. గురుకుల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement