Wednesday, October 9, 2024

Deputy CM – ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా ఎల్‌.ఆర్‌.ఎస్ ‍అమ‌లు – భ‌ట్టి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ప్ర‌జ‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత ప‌టిష్టంగా లే అవుట్ రెగ్యులైజేష‌న్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్‌)ను అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగా ఈ రోజు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క త‌న కార్యాల‌య‌లంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మీక్షా స‌మావేంలోనే ఎల్.ఆర్‌.ఎస్ విధివిధానాల‌పై పూర్తి స్థాయిలో క‌స‌ర‌త్తు నిర్వ‌హించారు. ఎల్.ఆర్.ఎస్ వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని అధికారుక‌లు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు.

- Advertisement -

ఎల్.ఆర్.ఎస్ అనుమ‌తుల కోసం ప్ర‌జ‌లు చేసుకున్న ద‌ర‌ఖాస్తులు వీలైనంత వేగంగా ప‌రిష్క‌రించాల‌ని ఉప ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచ‌న చేశారు. ఇందు కోసం 33 జిల్లాల్లో ప్ర‌త్యేకంగా ఒక టీముల‌ను రూపొందుకోవాల‌ని చెప్పారు. సిబ్బంది కొర‌త ఉంటే ఇత‌ర శాఖ‌ల నుంచి డెప్యుటేష‌న్ తీసుకోవాల‌న్నారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో ఫైనాన్స్ చీఫ్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ రామ‌కృష్ణారావు, ల్యాండ్ అండ్ రెవెన్యూ ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ నవీన్ మిట్ట‌ల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సెక్రెటరీ జ్యోతి బుద్ద ప్రకాష్, జీహెచ్ఎంసీ కమిషనర్ కాట అమ్రపాలి, గృహ‌నిర్మాణ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి విపీ గౌత‌మ్ తదిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement