Friday, September 6, 2024

Delhi Tour – హ‌స్తిన ప‌ర్య‌ట‌న‌లో రేవంత్ రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేటి ఉద‌యం ఢిల్లీకి చేరుకున్నారు.. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి ఢిల్లీ వ‌చ్చారు.. ఈ మేరకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసిన నేపథ్యంలో వరంగల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించాలనే సర్కార్ యోచిస్తోంది. అయితే, ఆ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్లుగా స‌మాచారం. . కాగా, ఇప్పటికే ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి సీఎం రాహుల్ గాంధీని కలవబోతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లు శాఖ‌ల‌కు చెందిన కేంద్ర మంత్రుల‌తో కూడా రేవంత్ క‌లువ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement