Friday, September 6, 2024

Delhi – కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ తో రేవంత్ భేటి

రూ.500 గ్యాస్ ఇస్తున్నామ‌న్న రేవంత్
రాయితీని ముందుగా చెల్లించే అవ‌కాశం
క‌ల్పించాల‌ని విన‌తి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూఢిల్లీ – కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలో రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తోన్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వినియోగ‌దారుల‌కు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కు (ఓఎంసీ) చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement