Friday, September 20, 2024

Delhi – ప్రపంచ ఆహార సదస్సులో పాల్గొన్న మంత్రి తుమ్మల…

ఢిల్లీ లోని భారత మండపంలో జరుగుతున్న ప్రపంచ ఆహార సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ,మోనిన్ ఇండియా ఎండీ జెర్మైన్ అరౌద్,బిఎల్ అగ్రో ఎండీ నవనీత్ రవికర్ లతో పాటు పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యి తెలంగాణ రాష్ట్రంలో లభ్యమయ్యే అవకాశాలను వివరించి, ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడానికి రాష్ట్రానికి రావాలని వారికి ఆహ్వానించారు.

అదే విధంగా సదస్సులో భాగంగా భారత్ మండపంలోని హాల్ నం 2 లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను సందర్శించి రాష్ట్రానికి చెందిన పలు స్టాల్ లను పరిశీలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement