Wednesday, October 16, 2024

Medak: తల్లి మృతి… కొడుకు హఠాన్మరణం

తల్లి చనిపోవడంతో… జీర్ణించుకోలేని కొడుకు హఠాన్మరణం చెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన లలిత, నరేందర్ తల్లి, కొడుకులు. వారి కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి లలిత నిన్న ఉదయం గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. దీంతో తల్లి తనను వదిలి వెళ్లిపోయిందనే దిగులుతో కొడుకు నరేందర్ గుండెలు అవిసేలా రోదించాడు.

చివరకు వారి దగ్గరి బంధువులు, గ్రామస్థులు లలిత అంత్యక్రియలను నిర్వహించారు. కన్న తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కొడుకు నరేందర్ తీవ్ర మనోవేదనకు గురై నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు. దీంతో కౌడిపల్లి మండల కేంద్రంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ హృదయ విదారక ఘటన చూసిన గ్రామస్థులు, బంధువులు, ప్రతిఒక్కరూ కంటనీరు పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement