Friday, September 6, 2024

TS: బాసర ఆలయంలో భక్తజన సందడి..

బాసర, జూన్ 7 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో భక్తజన సందడి నెలకొంది. అమ్మవార్లను దర్శించుకోవ‌డానికి తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయం నుండి భక్తులు గోదావరి నది లో పుణ్య స్నానాలు ఆచరించి గోదారమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. నదీ తీరాన గల శివాలయంలో భక్తులు అర్చన పూజలు చేశారు.

అనంతరం భక్తులు, చిన్నారులు అమ్మవారి దర్శనం, అక్షరాభ్యాస పూజల కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. వేసవి సెలవులు ముగిసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో భక్తులు అధికంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.

దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ విజయరామారావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్యూ లైన్ లో భక్తులకు మంచినీరు అందించే ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తమ చిన్నారులకు ఆలయ అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాస పూజలను ఆలయ అర్చకులచే జరిపించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement