Monday, September 16, 2024

CPI Narayana – పులి మీద రేవంత్ స్వారీ… దిగితే మింగేస్తుంది జాగ్ర‌త్త‌…

హెచ్చ‌రించిన సిపిఐ నారాయ‌ణ‌
హైడ్రా చ‌ర్య‌ల‌ను స్వాగ‌తిస్తాం.
పేద‌ల జోలికి వ‌స్తే ఊరుకోం
అ క‌బ్జాల ప‌ర్వంపై అఖిల‌ప‌క్షం నిర్వ‌హించండి..

ఆంధ్రప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం అయిన జైళ్లను బాగుచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్‌లోని మగ్ధుమ్ భవన్‌లో సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. హైడ్రా చర్యలను అభినందిస్తూనే.. హైడ్రా చ‌ర్య‌ల‌తో బడా బాబులు జైలుకు వెళ్లాల్సి వస్తుందా? లేదో తెలియ‌దు కానీ.. వారి ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డే జైలుకు వెళ్లే ప్రమాదం ఉండ‌వ‌చ్చ‌ని కామెంట్ చేశారు. ప్రధానిగా మోదీ అయ్యాక నేను సన్యాసిని.. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు అన్నార‌ని, కానీ, అప్పులు ఎగ్గొట్టిన వాళ్లలో ఒక్క విజయ్ మాల్య తప్ప మిగితా అందరూ గుజరాత్ వారేనని నారాయ‌ణ గుర్తు చేశారు.

- Advertisement -

మోదీ ద‌య‌తోనే అదాని..
ప్ర‌ధాని మోదీ దయతో అదానీ పెరిగార‌ని సీపీఐ నేత నారాయ‌ణ ఆరోపించారు. ఆయన సొంతంగా ఎదగలేదన్నారు. సెబీ కూడా అదానీకి దాసోహం అయ్యిందని విమర్శించారు. పదేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు దేశ వ్యాప్తంగా నిరసనలకు సీపీఐ పిలుపు ఇచ్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మోదీని మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.ట్రాఫిక్ నుంచి హైదరాబాద్ బయటపడాల్సిన అవసరం ఉందన్నారు.

హైడ్రా తీరు అభినంద‌నీయం..

హైడ్రా పని తీరు అభినందనీయమని సీపీఐ నేత నారాయ‌ణ అన్నారు. ప్రభుత్వ భూమి నోటరీ పద్ధతుల్లో కూడా కొందరు అమ్మకాలు చేశారు.ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి.. చెరువు నిర్మాణం చేయా లన్నారు. రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నాడు. మధ్యలో ఆపేస్తే.. పులి తినేస్తుందని హెచ్చరించారు. నాగార్జున బఫర్ జోన్‌లో కాదు ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మాణం చేశాడన్నారు. ఎంఐఎం చెబుతున్నట్లు ప్రభుత్వ ఆఫీస్ లు కూల్చేసే విషయంపై రేవంత్ రెడ్డి అఖిల పక్ష సమావేశం పెట్టాలన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వాటితో ప్రైవేటు నిర్మాణలు పోల్చడం తప్పన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement