Saturday, September 7, 2024

Counting – ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. నల్లగొండ పట్టణ శివారులోగల ఎ దుప్పలపల్లి స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములోని నాలుగు కౌంటింగ్‌ హాల్స్‌లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను సిబ్బంది కట్టలుగా కడుతున్నారు..

మధ్యాహ్నం వరకు బండిల్స్‌ కట్టడం పూర్తిచేసి మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇవాళ అర్ధరాత్రికల్లా తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నది.

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగు రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారులు కౌంటింగ్‌ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరిచందన ప్రకటించారు. 144 సెక్షన్‌ అమలులో ఉన్న కారణంగా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కౌంటింగ్‌ కేంద్రం దగ్గర గుమికూడవద్దని ఎస్పీ చందన దీప్తి ఆదేశించారు. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement