Saturday, September 7, 2024

Counter – యువ‌త‌కు జాబ్స్ రాకుండా కేటీఆర్‌, హ‌రీశ్‌రావు కుట్ర‌ – మంత్రి పొన్నం


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్: యువ‌త‌కు జాబ్స్ రాకుండా చేయాల‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు కుట్ర చేస్తున్నార‌ని తెలంగాణ ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. గురువారం గాంధీ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియా మాట్లాడారు. ప్రతి పక్షాల ఉచ్చులో పడొద్దని ఆయ‌న‌ సూచించారు. అభ్య‌ర్థులు చదువుకోవాల్సిన సమయాన్ని వృధా చేసుకోవొద్దని కోరారు. మేథావుల అభిప్రాయం తీసుకొని త్వరలో జాబ్ క్యాలెండ‌ర్ విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటుంద‌న్నారు.

- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ ఆట కోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, హైదరాబాద్ ని మంత్రి కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఐదు ఏండ్లలో హైదరాబాద్ కు ఏం చేశారో, ఎన్ని నిధులు తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ లు మిత్ర పక్షంగా ఉండి హైదరాబాద్ ను ఆగం చేసింది వాస్తవం కాదా? అని అన్నారు. అభివృద్ధిపై త‌మ‌ మంత్రి వర్గంతో చర్చకు పిలిస్తే రాలేదని తెలిపారు. హైదరాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement