Saturday, October 5, 2024

కౌన్సిలర్ భర్త పై క‌త్తులతో దాడి …. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

జగిత్యాల జిల్లాలో కోరుట్ల పట్టణ కౌన్సిలర్ భర్త పై హత్యాయత్నం జ‌రిగింది.. కోరుట్ల పట్టణంలో కార్గిల్ చౌక్ వద్ద ఓ దుకాణంలో పట్టణ 9వ వార్డు కౌన్సిలర్ ఉమారాణి భర్త లక్ష్మీరాజం పై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు.. లక్ష్మి రాజం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేటి ఉద‌యం మృతి చెందారు.. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్లో లక్ష్మీరాజం టీ తాగుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు అతడి మెడపై కత్తితో దాడి చేసి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. తీవ్ర గాయాలతో లక్ష్మీరాజం పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కాసేపటికే ఆయన మృతిచెందారు. ఘటనాస్థలిని డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement