Thursday, September 19, 2024

TG: ఔట్‌ పోస్టు ద్వారా నిరంతర పర్యవేక్షణ… రామగుండం సీపీ శ్రీనివాస్‌

రామగుండం, సెప్టెంబర్‌ 16 (ప్రభన్యూస్‌): పోలీస్‌ ఔట్‌ పోస్టు ద్వారా నిరంతర పర్యవేక్షణతో పాటు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని రామగుండం పోలీస్‌ కవిుషనర్‌ ఎం.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌ పెద్దపల్లి జోన్‌ గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోదావరి బ్రిడ్జ్‌ వద్ద ఇటీవల నిర్మించిన పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ కంట్రోల్‌ రూమ్‌ను రామగుండం పోలీస్‌ కమీషనర్‌ ఎం.శ్రీనివాస్‌ ప్రారంభించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ… గోదావరి నది బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఔట్‌ పోస్ట్‌ ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందితో పాటు- ఇరువైపులా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా పోలీస్‌ కంట్రోలింగ్‌ సిస్టం కొనసాగిస్తామన్నారు. తద్వారా బ్రిడ్జిపై ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్న వాటిని క్లియర్‌ చేసేందుకు రివర్‌ గార్డ్‌ పోలీసులు సిద్ధంగా ఉంటారన్నారు. గోదావరి నది వద్ద ఎలాంటి ప్రమాదాలు జరిగినా క్షణాల్లో కాపాడేందుకు అన్ని రకాల పరికరాలతో పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంటారన్నారు.

సీపీ వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ సి.రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్‌, ట్రాఫిక్‌ ఏసీపీ నర్సింహులు, ఏఆర్‌ ఏసీపీ సురేంద్ర, గోదావరిఖని 1 టౌన్ ఇన్ స్పెక్టర్‌ ఇంద్రసేన రెడ్డి, 2 టౌన్‌ ఇన్స్పెక్టర్‌ ప్రసాద్‌ రావు, ఆర్‌ఐలు దామోదర్‌, వామన మూర్తి, సంపత్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement