Saturday, September 7, 2024

Congress: గాంధీ భ‌వ‌న్ లో ఘ‌నంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు…

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ 139 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. గాంధీ భ‌వ‌న్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ జెండాను నేత‌లు అవిష్క‌రించారు. అలాగే ఏఐసీసీ సేవాదళ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీభవన్ లో సేవాదళ్ కార్యక్రమాలు జరిపారు.

దీనిలో భాగంగా గాంధీభవన్ నుంచి సెక్రటేరియట్ మీదుగా నెక్లస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ పీసీసీ సేవాదళ్ చేపట్టింది. ఈ సేవాదళ్ ర్యాలీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మాజీ మంత్రి మండవ‌ వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్య‌క్రమంలో మంత్రి పొన్నంతో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement