Sunday, October 20, 2024

RR : కాంగ్రెస్ ను గెలిపిస్తే ధర్మాన్ని గెలిపించినట్లే

షాద్ నగర్, అక్టోబర్ 29 (ప్రభ న్యూస్)
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ధర్మాన్ని గెలిపించినట్టేనని త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అత్యంత ఆదరణ కల్పించాలని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కోరారు. చటాన్ పల్లి టిఆర్ఎస్ సీనియర్ యువ నాయకుడు మాజీ వార్డు సభ్యులు ఆలోని పల్లి రాజు గౌడ్, (కల్లురాజు) మాజీ కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో దాదాపు 35 మంది,కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మాధవరెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, సాయి, గుడాల అశోక్, గుడాల వెంకటయ్య, వెంకటేష్, నరేష్, నరసింహ, చిన్నయ్య, పెంటమ్మ, శేఖర్, చంద్రయ్య, రామకృష్ణ, శ్రీకాంత్, శేఖర్, చెన్నయ్య, రాజు గౌడ్ అనుచరులు 35 మంది కాంగ్రెస్ పార్టీలో చేర‌గా వారికి కండువా కప్పి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరానికి అధికార పార్టీ అహంకారానికి మధ్య జరుగుతున్నాయని ప్రజలు ఆత్మగౌరవం వైపు నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాయికల్ శ్రీనివాస్,తిరుపతి రెడ్డి, బస్వం అప్ప, రాయికల్ ఎంపీటీసీ అరుణ వెంకటరెడ్డి, సందీప్ రెడ్డి, సాలె శ్రీనివాస్, శేఖర్, రవికుమార్, సందీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ గౌడ్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement