Sunday, September 8, 2024

TS: కరీంనగర్ లో కాంగ్రెస్ దే గెలుపు… పొన్నం ప్రభాకర్

కరీంనగర్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ప్రదర్శన తీశారు. గీతాభవన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన కూడళ్ళ మీదుగా కొనసాగింది. ఈసంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని తెలియజేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ… నిరంతరం ప్రజలకు సేవ సేయడం త‌న కర్తవ్యమ‌న్నారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చారు.

ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ… కరీంనగర్ ఎంపీగా రాజేందర్ రావును అత్యదిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికలు దేశంలో ప్రధాని ఎవరు ఉండాలనే దాని కోసం జరుగుతున్నాయని, దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. మే 13న జరిగే పోలింగ్ లో కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటు వేసి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ కు మద్దతుగా యువకులు బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారంలో ప్రజలు కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జనంతో తెలంగాణ చౌరస్తా కిక్కిరిసి పోయింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement