Friday, September 6, 2024

TS: 6నెలల్లో కాంగ్రెస్‌ నేతలు.. గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చారు… హరీశ్​రావు

ఆరు నెలల్లో కాంగ్రెస్‌ నేతలు గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చారని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. ఇవాళ సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన రోడ్​షోలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ…. ఆ పార్టీపై కోపంతో బీజేపీకి ఓటు వేస్తే, పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లవుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్​ నేతలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు హామీలు అమలు చేశారా ? అని హరీశ్​రావు ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సమయానికి రైతుబంధు ఇచ్చామని, హస్తం పార్టీ హయాంలో బావుల వద్ద మోటార్లు కాలుతున్నాయని మండిపడ్డారు. కల్యాణ లక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారని, మహిళలకు బంగారం ఇవ్వడం ఏమో కానీ గోల్డ్​ ధరలు కొండెక్కాయని హరీశ్​రావు ఎద్దేవా చేశారు.

- Advertisement -

కాంగ్రెస్‌ వచ్చాక కేసీఆర్‌ కిట్‌, కల్యాణ లక్ష్మి బంద్ అయ్యాయ‌ని, ఓటుతో ఆ పార్టీకి, సీఎం రేవంత్‌ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గజ్వేల్‌ రూపురేఖలు మార్చిన కేసీఆర్‌ను దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీకి ఓటు వేస్తే నీళ్లు లేని బావిలో పడినట్లవుతుందని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేసినట్లు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారని, హామీలు అమలు చేయని మోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. గజ్వేల్‌ అభివృద్ధిని అడ్డుకున్న వారికి ఎలా ఓట్లు వేస్తారని చెప్పారు. దుబ్బాకలో చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement