Saturday, October 5, 2024

Congress – మాట త‌ప్పం… మడ‌మ తిప్పం… రుణ మాఫీ చేసి తీరుతాం … ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

ఆంధ్ర‌ప్ర‌భ – హైద‌రాబాద్ – ఆర్థిక ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉన్న‌ప్ప‌టికీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క . ఎట్టిపరిస్థితుల్లోనూ రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ 75 జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొని మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారని ఈ చేరికల పరిణామమే రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేస్తోందనడానికి నిదర్శనం అన్నారు.

ఇక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇవాళ తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతున్నదంటే దానికి వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ఓఆర్ఆర్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఇతర మౌళిక సదుపాయాలే కారణం అన్నారు. వైఎస్ దీర్ఘకాలిక పునాదుల వల్ల ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. వైఎస్ పాలన చిరస్థాయిగా నిలుస్తుందని, వైఎస్ ఆలోచన మార్గంలో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో రాబోయే రెండు దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పని చేయడం కోసం వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. వివిధ కారణాలతో పార్టీకి దూరమైన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు, పాత తరం కాంగ్రెస్ నాయకులంతా తిరిగి కాంగ్రెస్ లో చేరాలని ఆయ‌న‌ పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement