Thursday, October 17, 2024

TG | స్మితా సబర్వాల్‌పై కేంద్రానికి కంప్లైంట్‌..

తెలంగాణ ఐఏఎస్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్‌ దివ్యాంగుల రిజర్వేషన్లపై చేసిన కామెంట్ల దేశ‌వ్యాప్తంగా దుమారం సృష్టించాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. కాగా.. స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. కేంద్ర ప్రభుత్వానికి అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ను కలిసి స్మితా సబర్వాల్‌పై కంప్లైంట్ చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం- 2016, సెక్షన్ 92 ప్రకారం కేసు నమోదు చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ బండి సంజయ్‌ను విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement