Wednesday, September 18, 2024

TG: ఎల్లంపల్లి ముంపు గ్రామస్తులకు పరిహారం..

రూ.18 కోట్ల చెక్కు అందజేత
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి


ధర్మారం, ఆంధ్రప్రభ : ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపున‌కు గురైన చేగ్యాం గ్రామస్తులకు 18కోట్ల రూపాయల ప‌రిహారాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అందజేశారు. శనివారం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన సభలో పరిహారం చెక్కును అందించారు.

అనంతరం మాట్లాడుతూ.. ముంపు గ్రామస్తులను గత ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, ఎంపీ గడ్డ వంశీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement