Wednesday, October 16, 2024

Collectors Meet – ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధులు మీరే …. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి …

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కలెక్టర్లు ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. స‌చివాల‌యంలో నేడు జ‌రిగిన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశంలో పలు సూచనలు చేశారు. కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సంక్షేమ పథకాలు కొన్ని జిల్లాల్లో కింది స్థాయి వరకు వెళ్లడం లేదని అన్నారు.

రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా తాము జిల్లాలకు వెళ్లినప్పుడు అర్థమవుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు.

ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందన్న సందేశాన్ని స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య కలెక్టర్లు వారధి లాంటివారని వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement