Friday, September 27, 2024

నిరుపేదలకు అండ సీఎంఆర్ఎఫ్ – ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి – నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 173 మందికి 50,91,600 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.

. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలు అనారోగ్యాల బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సంబంధించిన రసీదులతో దరఖాస్తు చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక చేయుతను అందిస్తున్నామన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. మాత శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి గర్భిణీలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారన్నారు.

- Advertisement -

కెసిఆర్ కిట్ లాంటి చారిత్రాత్మక పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు మాటలకే పరిమితం అవుతాయని, తమ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిరుపేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తల తోపాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement