Sunday, September 15, 2024

TG: ‘ఏఐ’ రోడ్‌మ్యాప్‌ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌..

హైదరాబాద్‌: నగరంలోని హెచ్‌ఐసీసీలో గ్లోబల్‌ ఏఐ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐ రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు.

ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఏఐలో పూర్తిగా పట్టు సాదించబోతున్నామన్నారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఏటా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. డీప్‌ఫేక్‌ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని పేర్కొన్నారు. ఎథికల్ ఏఐ విషయంలో జపాన్‌ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

- Advertisement -

హైదరాబాద్‌కు సమీపంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలు ఇక్కడ ఏర్పాటు అయ్యేలా చూస్తామని వివరించారు. రాబోయే రెండు రోజులు హెచ్ఐసీసీ వేదికగా ఏఐ పైనా చర్చలు, సెమినార్లు ఉంటాయని శ్రీధర్‌బాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement