Thursday, September 12, 2024

TG: రైతులను దగా చేసిన సీఎం రేవంత్ : హరీశ్ రావు

పాప పరిహార పూజలు చేసిన హరీష్ రావ్
ఘన స్వాగతం పలికిన గొంగిడి దంపతులు
యాదాద్రిలో హరీష్ రావ్ ప్రత్యేక పూజలు

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి నర్సన్న సాక్షిగా ఒట్టు వేసి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి శాపం తెలంగాణ ప్రజలకు తగలకుండా కాపాడాలని కోరుకున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తెలిపారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి శ్రీ లక్ష్మి నారసింహా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

ఈసందర్భంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి నర్సన్న కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్టు 15 లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీలక్ష్మి నర్సింహా స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేసారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కీడు జరగకూడదని పాప పరిహార పూజలు ని ర్వహించినట్లు చెప్పారు. వీరి వెంట నాయకులు దేశపతి శ్రీనివాస్, బూడిద బిక్షమయ్య గౌడ్, బాలరాజు యాదవ్, క్యామా మల్లేష్, కర్రె వెంకటయ్య, శ్రీకర్ రెడ్డి, రవీందర్ గౌడ్, తదితరులు ఉన్నారు.

స్వస్తివచనంతో స్వాగతం
నర్సన్నను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును గురువారం ఆలయ అర్చకులు స్వస్తివచనంతో స్వాగతం పలికి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు హరీష్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరి వెంకటేశ్వర్లు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ లకు వేద ఆశీర్వచనం నిర్వహించి వారికి లడ్డూ ప్రసాదం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement