Friday, September 20, 2024

TG: నేడు హస్తనకు సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. అనుకున్నట్లుగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ మేరకు వారిద్దరూ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణ, నామినేట్ పదవుల భర్తీ, కొత్త పీసీసీ చీఫ్ నియామక విషాలు భేటీలో చర్చకు రానున్నాయి.

ఈ పర్యటనలో భాగంగా ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సమావేశమై సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement