Sunday, July 7, 2024

Delhi: అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించేందుకు గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించారు. కాగా ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement