Friday, October 4, 2024

Delhi: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కేటాయింపు తదితర కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు.

నరేంద్ర మోడీతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement