Friday, September 6, 2024

TG: తండాలు, గూడెలకు గుడ్‌ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలోని మారుమూల తండాలు, గూడెలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే అన్ని తండాలకు బీటీ రోడ్డు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు త్వరితగతిన ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో దాదాపు 7 లక్షల గ్రామాలకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కరువైందని అన్నారు. ఇప్పటికే చాలా గ్రామ పంచాయతీల నుంచి తీర్మాణాలను కూడా తెప్పించామని తెలిపారు. తండాలు, గూడెలలో కనీస సౌకర్యాలు కల్పించినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరిగినట్లుగా తమ ప్రభుత్వం భావిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement