Friday, September 20, 2024

Chityala – ట్రాక్టర్ ఢీ – వృద్ధు రాలి మృతి

చిట్యాల ఆగస్టు 10 ప్రభ న్యూస్ జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు నేరెళ్ల ఓదమ్మ( 65) మృతి చెందింది. మరో వ్యక్తికి గాయాలపాలయ్యాడు.

గ్రామస్తుల కథనం ప్రకారం నవాబు పేట గ్రామానికి చెందిన వృద్ధురాలు నేరెళ్ల ఓదెమ్మ, బోయిని రాజయ్య ఇంటి దగ్గర మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన డ్రైవర్ గిన్నారపు లక్కీ అజాగ్రత్త గా ట్రాక్టర్ నడిపి తో ఢీకొట్టడంతో వృద్ధురాలు తీవ్రంగా కాళ్లు చేతులు తలకు గాయాలు అయ్యాయి.

- Advertisement -

స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి భర్త నేరెళ్ల రాజ పోచయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement