Tuesday, September 17, 2024

Be Alert అప్రమత్తంగా ఉండాలి – ప్రజలకు చిరంజీవి పిలుపు

తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటిలో మునిగిపోయాయి.ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపు ఇచ్చారు. . ఈ మేరకు ఎక్స్’ లో చిరంజీవి ట్వీట్ చేసారు.

” మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను.” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement