Monday, September 16, 2024

Charla – తూరుబాక వద్ద బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవాహం

భద్రాచలం, (ప్రభ న్యూస్): గోదావరి వద్ద వరద ఉద్రితి పెరిగి, నీటి మట్టం 51 అడుగుల పైకి చేరడంతో ఏజెన్సీ వాసులకు ఇబ్బందులు మొదలయ్యాయి. దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామం వద్ద బ్రిడ్జి పైనుంచి వరదనీరు ప్రవహిస్తూ ఉండటంతో దుమ్ముగూడెం,చర్ల మండలాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఆయా మండలాలకు వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది. వరద సహాయక కంట్రోల్ రూమ్ కు వివరాలు అడిగి తెలుసుకుని మరింత సమాచారాన్ని పొందగలరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement